పొద్దున ఒకావిడ ఫోన్ చేశారు. జీవని గురించి పేపర్లో చూశాను, విరాళం ఇవ్వాలని.

ఈ రోజు పిల్లల్ని పార్కుకు తీసుకుపోతున్నాం, అక్కడికి రాగలిగితే రండి. పిల్లల్ని పరామర్శించినట్లు ఉంటుంది అలాగే మీరు విరాళం ఇవ్వచ్చు అని చెప్పాను.

నేను రాలేను మీమీద నమ్మకం ఉందిలే. పేపర్లో చూశా కదా, కోర్టు రోడ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు రండి అని ఆమె చెప్పారు.

ఓ పది నిముషాలకు ఆమె వచ్చారు. మెల్లగా నడుస్తున్నారు. తన పేరు శాంతాదేవి అని జిల్లా ఖజనా కార్యాలయంలో STOగా పనిచేసి రిటైర్ అయ్యానని అన్నారు. ఆమెకు 71 ఏళ్ళ వయసు. రకరకాల బాధితుల గురించి పేపర్లో రోజూ చూస్తుంటాను నాయనా! ఎవరైనా ఇలా ఫోన్ నెంబర్లు లాంటివి ఇస్తే వెంటనే సహాయం చేస్తాను అని అన్నారు.

బాగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆ పెద్దామె బాధితులకు ఫోన్ చేసి సహాయపడటం గొప్పగా అనిపించింది.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ramnarsimha Says:
  2. SHANTHA DEVI..Gariki,

    Naa hrudapurvaka abhinandanalu

    teliyajestunnanu..

     
  3. durgeswara Says:
  4. aa talliki naa namaskaaramulu teliyajeyamdi

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo