గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న అనంతపురంలోని రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థలు జీవనికి 30,000/- విలువ చేసే 10 క్వింటాళ్ళ బియ్యం విరాళంగా ఇచ్చాయి. కపిల్ చిట్స్, సాయి భావన, చెరిష్, మణిక్రిష్ణ, వజ్రగిరి, ధీమా, సంపదైశ్వర్య,శక్తిస్వరూప్, శ్రీరాం రాఘవేంద్ర, సునేత్ర, శుభసంపద, పరమేశ్వరి, ఖాద్రివాసి, చలపతి, మార్గబంధు, శివకామేశ్వరి చిట్ ఫండ్ సంస్థలు ఈ విరాళం అందజేసాయి. వాటి ప్రతినిధులు దివాకర్ రెడ్డి, గుప్త, మల్లిఖార్జున, సుభాన్, రమేష్, అస్లం, మధు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఆగస్టు 15కు, జనవరి 26కు చిట్ ఫండ్ సంస్థలు బియ్యం విరాళంగా ఇస్తున్నాయి. వీరందరికీ జీవనిని పరిచయం చేసి విరాళం అందించడంలో సహకరించే చిలుకూరు కుమారస్వామి రెడ్డి గారికి ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్స్, అనంతపురం జిల్లా ) ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ మేధోపరంగా మమ్మల్ని నడిపించే కుమార్ అన్నకు ధన్యవాదాలు చెప్పడం తప్పే అవుతుంది. ఎందుకంటే జీవనిలో ఆయన కూడా ప్రధాన పాత్రధారి కాబట్టి.






 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo