మిత్రులారా ఇది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య నిధుల లభ్యతని బట్టి ఉంటుంది. నిధులకు ఇబ్బంది అయితే మనకు తప్పనిసరిగా అవసరం అయ్యేవి మాత్రమే కట్టుకుంటాము.తరగతి గదులు - 7స్టాఫ్ రూములు - 2ప్రధానోపాధ్యాయులు & కార్యాలయ సిబ్బంది - 1జీవని కార్యాలయం - 1గ్రంథాలయం - 1ల్యాబ్ - 2 ( కంప్యూటర్, ఇతర సబ్జెక్టులు ) సెమినార్ హాలు - 1 హాస్టల్ గదులు పెద్దవి - 4స్టోర్ రూము + వంటగది + భోజన శాల - 1టీచర్లకు క్వార్టర్స్ - 3నాన్ టీచింగ్ సిబ్బందికి - 3 టాయిలెట్లు - అవసరమైనన్ని కంప్యూటర్లు ఓ 10 సమకూరితే అపుడు ల్యాబ్ కు బదులు క్లాస్ కు ఒకటి పెడితే ఎలా ఉంటుంది?...
మిత్రులారా జీవని చరిత్రలో మరో మైలు రాయి. శ్రీ రంగారెడ్డి గారు,PRINCIPAL, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR జీవనికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థలం అనంతపురానికి 19 కిలోమీటర్ల దూరంలో గార్లదిన్నె సమీపాన ఉంది. ఇది మంచి సారవంతమైన, నీటి వనరులున్న ప్రాంతం. బెంగుళూరు - హైదరాబాదు హైవే పక్కనే ఈ స్థలం ఉంది. ఈ స్థలం విలువే దాదాపు 25 లక్షలు ఉంటుంది. రంగారెడ్డి గారి వితరణకు జీవని హృదయ పూర్వకంగా కృతఙ్ఞతలు తెల్పుతోంది. శ్రీ. సాంబశివా రెడ్డిగారు SECRETARY & CORRESPONDENT,...
ఊరును ఎంపిక చేసుకోవడంలో ఎందుకు విఫలం అయ్యాం అన్న ప్రశ్నకు సమాధానం చెప్తాను. కోవెలకుంట్ల, నంద్యాల మీదుగా కుందూ నది వెళ్తుంది. అది కూడా తన వంతు బీభత్సాన్ని సృష్టించింది. అయితే ఆ పల్లెలు ఏవీ పూర్తిగ మునిగిపోలేదు. కానీ కుందూ పల్లెల్ని చుట్టివేసింది. దారుల్ని భయంకరంగా కోసివేసింది. చుట్టూ నీళ్ళు మధ్యలో ఊర్లు, దాదాపు లంకల్లాగా తయారైంది పరిస్థితి. పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేశారు. అందువల్ల అందరూ ఈ పల్లెలు బాగా దెబ్బ తిన్నాయని అపోహపడ్డారు. ఆ విధంగా... చెప్పినవారి తప్పు కూడా లేదు....
ఈ మాటలు అన్నది గ్రామస్థులు. వివరాల కోసం మిమ్మల్ని మాతో పాటు నంద్యాల తీసుకువెళ్తున్నాను. మొదటిసారి వరద సాయాన్ని సుంకేశుల వైపు పంపిణీ చేశాము కాబట్టి ఈ సారి వ్యతిరేక దిశలో నంద్యాల వైపు వెళ్దాం అని అనుకున్నాము. మా వాహనానికి డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. రంగయ్య గారు జెండా ఊపాలి. ఆయనతో నాకు పూర్వ పరిచయం ఉంది. పై స్థాయి అధికారుల్లో నిడారంబరంగా, నిష్కల్మషంగా, అహంభావం లేని వారు అరుదుగా కనబడతారు. వీరిలో ఈయన ప్రథములు. ఆయన బంగ్లా వద్ద కార్యక్రమం. నేను, సతీష్ బయట వాహనానికి బ్యానర్లు కట్టించడం లాంటి పనులు చేస్తున్నాము. ఆలస్యం...
మిత్రులారా ఇంతవరకు వరద బాధితులకు మనం చేసింది తొలిదశ సహాయం. ఇంకా ఎవరైనా సహాయం చేయాలని ఉంటే వారికి అవకాశం... ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలు అందరూ జాలర్లు. వారి అందరి వృత్తి చేపలు పట్టడం. వలలు కొట్టుకుపోయి వీరంతా నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన జాలర్లకు వలలు పంపిణీ చేస్తుంది. కొందరు గుర్తింపు లేనివారు ఉన్నారు. వీరికి వలలు కొనివ్వడానికి కర్నూలులో రచయిత మిత్రుడు ఎం.హరికిషన్ ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క వల 3000/- అవుతుంది. సైజు పెరిగేకొద్దీ వీటి ధర కూడా భారీగా వుంది. ఒక కుటుంబం నిలబడటానికి ఇది సరిపోతుంది....
మిత్రులారా నిన్న సాయంత్రం అనంతపురంలోని SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY లో ఫ్రెషర్స్ డే వేడుక జరిగింది. ఈ కాలేజి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి మన జీవని సలహా సంఘం సభ్యులు కూడా. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం.కె.సింగ్ వచ్చారు. స్టేజి మీద ఆయన కాక మరో ఐదుగురు ఉన్నారు. ఈయనది చివరి ప్రసంగం. మొదట ఐదుగురు ఇంగ్లీషులోనే మాట్లాడారు. కింద ప్రేక్షకులేమో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుని వచ్చిన విద్యార్థులు. దాదాపు 600 మంది ఉన్నారు. ఎస్పీ గారు తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టగానే చెవులు చిల్లులుపడెలా కేకలు పెట్టారు పిల్లలు....

మొత్తం మూడు వాహనాల్లో మేము బయలుదేరాము. ఒక క్యారేజి వాహనం, క్రూయిజర్, కారు. దాదాపు 20మంది. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గుండ్రేవుల వుంది. కర్నూల్ దగ్గర ప్లానింగ్ కోసమని నేను సాంబశివారెడ్డి కారులోకి ఎక్కాను. ఆ తర్వాత మిగతా రెండు వాహనాలు, మేము వేర్వేరు దారుల్లో గుండ్రేవుల వైపు వెళ్ళాము. మా ప్రయాణం దాదాపు తుంగభద్ర నదికి సమాంతరంగా సాగింది. బహుశా గుండ్రేవుల గ్రామం నదికి ఒక కిలోమీటరు దూరంలో ఉందేమో. తుంగభద్ర ఒక చిన్న పాయలాగా మాకు కనిపించింది....
మొదటి రోజు 2000 మందికి పులిహోర సిద్ధం చేయించాము. ఒక పక్క భరద్వాజ గారి విరాళాల సేకరణ ఊపందుకుంది. అమెరికా వాళ్ళ నుంచి సేకరించిన విరాళాల్ని జీవనికి పంపాలన్న ప్రాథమిక ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇక నాకు మరింత ఉత్సాహం వచ్చింది. పొద్దున్నే ఆహారంతో ఒక లారీ కర్నూలు బయలుదేరింది. అప్పటికి కర్నూలు కొంచెం కూడా తేరుకోలేదు. మన వాళ్ళు పాత బస్తీ ప్రాంతంలో పంపిణీ చేశారు. అలాగే కొన్ని కొత్త దుప్పట్లు పాత బట్టలు వగైరాలు కూడా... తర్వాతి రోజు 3000 మందికి చపాతీలు చేయించి తిరిగి కర్నూలు పాత బస్తీకే పంపాము. శ్రీ సాయిదత్తా మ్యాక్ సొసైటీ ప్రతినిధి అనిత...

గాంధీ జయంతి రోజున కర్నూల్ నగరాన్ని వరద ముంచెత్తింది. నేను ఇంకా పేపర్ కూడా చూడలేదు. బ్లాగులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో భరద్వాజ గారు వరద బాధితులకోసం మీరు ఏమైనా చేస్తున్నారా అంటూ అడిగారు. చేయగలిగినంత ఆర్థిక సామర్థ్యం మన సంస్థకు ఎక్కడ ఉంది అని నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. భరద్వాజ గారు చూస్తుండగానే విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. 10 గంటల సమయంలో జీవని యూత్ సభ్యుడు రఘు ఫోన్ చేసి, అన్నా వరద బాధితులకోసం ఏమైనా చేద్దాం అని అన్నాడు. సరే...