మిత్రులారా నిన్న సాయంత్రం అనంతపురంలోని SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY లో ఫ్రెషర్స్ డే వేడుక జరిగింది. ఈ కాలేజి కరస్పాండెంట్ సాంబశివా రెడ్డి మన జీవని సలహా సంఘం సభ్యులు కూడా. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎం.కె.సింగ్ వచ్చారు. స్టేజి మీద ఆయన కాక మరో ఐదుగురు ఉన్నారు. ఈయనది చివరి ప్రసంగం. మొదట ఐదుగురు ఇంగ్లీషులోనే మాట్లాడారు. కింద ప్రేక్షకులేమో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుని వచ్చిన విద్యార్థులు. దాదాపు 600 మంది ఉన్నారు. ఎస్పీ గారు తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టగానే చెవులు చిల్లులుపడెలా కేకలు పెట్టారు పిల్లలు. ఆ తర్వాత నా వంతు వచ్చింది. మనమెట్లాగూ ఇంగ్లీషులో వీకు. ఎక్కడైనా, ఎప్పుడైనా మాట్లాడేదే తెలుగు, మన భాష రాకపోవడం ఎదుటివాడి ఖర్మ. సరే నేను కూడా " వేదికను అలంకరించిన... " అని మొదలు పెట్టగానే పిల్లలు హోరుమని కేకలు వేశారు.


ఇది నాకు ఒక భిన్నమైన అనుభవం. ఇన్నాళ్ళూ ఈ పిల్లలమీద ఉన్న ఆంగ్ల ముద్రను నేను సవరించుకున్నాను. అలాగే డ్యాన్సుల కోసం, పాడటం కోసం పిల్లలు ఇళయరాజా కాలం నాటి మెలోడీ పాటల్ను ఎంపిక చేసుకోవడం కూడా విశేషం.

ఈ కార్యక్రమంలోనే జీవని వలంటీర్లకు ఎస్పీ ఙ్ఞాపికలు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.

మిత్రులారా వరద సిరీస్ ను మరి రెండు టపాలతో ముగిస్తున్నాము. ఇక్కడ మేమంతా తిరిగి యధావిధిగా జీవని పనుల్లో ఈ రోజు నుంచి నిమగ్నం అవుతున్నాము.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo