ఊరును ఎంపిక చేసుకోవడంలో ఎందుకు విఫలం అయ్యాం అన్న ప్రశ్నకు సమాధానం చెప్తాను. కోవెలకుంట్ల, నంద్యాల మీదుగా కుందూ నది వెళ్తుంది. అది కూడా తన వంతు బీభత్సాన్ని సృష్టించింది. అయితే ఆ పల్లెలు ఏవీ పూర్తిగ మునిగిపోలేదు. కానీ కుందూ పల్లెల్ని చుట్టివేసింది. దారుల్ని భయంకరంగా కోసివేసింది. చుట్టూ నీళ్ళు మధ్యలో ఊర్లు, దాదాపు లంకల్లాగా తయారైంది పరిస్థితి. పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేశారు. అందువల్ల అందరూ ఈ పల్లెలు బాగా దెబ్బ తిన్నాయని అపోహపడ్డారు. ఆ విధంగా... చెప్పినవారి తప్పు కూడా లేదు. ఇంకో విషయం ఏమంటే ఇంతలా కాదుగానీ ఇలా ముంచెత్తడం కుందూ నదికి ప్రతి సంవత్సరం అలవాటేనట. ప్రజలు కూడా దానికి తగ్గట్టే అప్రమత్తంగా ఉంటారట. అవసరమైన సామగ్రి మాత్రమే తమ దగ్గర పెట్టుకుని ఉంటారు.


మేము నలుగురు వ్యక్తులు ఊరును డిసైడ్ చెయ్యడానికి మా శాయశక్తులా ప్రయత్నించాము. మా మిత్రుల సమాచారాన్ని బట్టి మాత్రమే మేము వెళ్ళాము. ఇలా వెళ్తున్నవారికి ప్రభుత్వం నుంచి కించిత్తు గైడెన్స్ కూడా లేకపోయింది. @ కొత్త పాళీ గారు: మరి ఏరకంగా మేము అనంతపురం నుంచి ఆ గ్రామాలను సెలెక్ట్ చేసుకుని ఉండవచ్చు చెప్పండి. సరే చీకటి పడిపోయింది. వెనక్కి వచ్చే క్రమంలో ఉప్పులూరు అనే గ్రామం, కేవలం 50 ఇళ్ళు ఉంటాయి.వరద కాదుగానీ మామూలుగానే వారి పరిస్థితి ఘోరంగా ఉంది. వారికి కిట్స్ అందజేశాం. ఆ తర్వాత అందరం సమావేశం అయ్యి పొద్దుటే మళ్ళీ సుంకేశుల వైపు వెల్డామని నిర్ణయించాము. రాత్రికి మిత్రుడు నరేష్ వాళ్ళ ఊరు జూలెపల్లెలో విశ్రమించాము. ఆఫీసుల తొందర ఉన్న వారు అనంతపురం వెళ్ళి పోయారు.


మరుసటి రోజు మధ్యాహ్నానికి ముడుమాల చేరుకున్నాము. మా వాహనాన్ని చూడగానే జనం ఎగబడ్డారు. దాదాపు ఐదారు వందల మంది వాహనం వెంట పరుగులు తీస్తూ వచ్చారు. నిజంగా ఆకలి గొన్న వాడి పరిస్థితి అప్పుడు అర్థం అయింది. మా వాహనం ఒక చోట స్లో చేశారు. మేమంతా ముందు వైపు ఉన్నాం. ఒక వ్యక్తి వెనక వాహనం ఎక్కి ఒక మూట తీసుకుని పారిపోయాడు. మన వాలంటీర్లు కవర్ చేసి జాగ్రత్తపడ్డారు. అదీ అక్కడి పరిస్థితి. మేము ఒకచోట సెటిల్ అయ్యేలోపు విచక్షణ లేకుండా తోపులాడుకుంటున్నారు.

మేము బాలిరెడ్డి అనే ఆయన సహాయం తీసుకున్నాము. ఆ ఊరి మొత్తానికి పూర్తిగా మునిగిన ఇళ్ళు ఆయనదే. కాకపోతే పెద్ద రైతు. ఇంకా ఆరోజే ఆయన ఇళ్ళు క్లీన్ చేయించాడు. ప్రజలందర్నీ కాంపౌండులో కూచోబెట్టి వీధుల వారిగా టోకెన్లు ఇచ్చి పంపిణీ చేశాము. తర్వాత గందరగోళం ఎక్కువకావడంతో మా ప్లాన్ మార్చాము. వెహికిల్ ను ఇళ్ళ వద్దకు తీసుకువెళ్ళి కిట్స్ పంపిణీ చేశాము.
తర్వాత సింగవరం వెళ్ళాము అక్కడినుంచి సుంకేశుల కూతవేటు దూరంలో వుంది. అక్కడ మిత్రుడి ఇంట్లో భోజనం చేసుకున్నాము. బట్టలను పంపిణీ చేశాము. తిరిగి అనంతపురం బయలుదేరాము.

on
categories: | edit post

1 Responses to ఆకలి విచక్షణను చంపివేస్తుంది

  1. Anonymous Says:
  2. good to hear
    great heart
    aayana peru laage aayana manasoo peddade..,

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo